జాతీయస్థాయి కరాటే పోటీల్లో మంథని జపాన్ షిటోరియు కరాటే విద్యార్థుల ప్రతిభ

 సిరా న్యూస్,మంథని;
జాతీయస్థాయి కరాటే పోటీల్లో మంథని జపాన్ షిటోరియు కరాటే విద్యార్థుల అత్యంత ప్రతిభ కనబరిచారు. ఆదివారం మంచిర్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో శిక్షకులు,కాయ్ స్పోర్ట్స్ కమిషన్ కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో మంథని కి చెందిన జపాన్ షిటోరియు కరాటే అకాడమీ విద్యార్థులు కట, కుమితి విభాగాలలో అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు వెండి పథకాలు సాధించారు. తాటి క్రిష్ విరాట్, బండారి మణికంఠ బంగారు పథకాలు సాధించగా బెజ్జంకి అక్షయ కీర్తన్ ఎండి ఇక్ర వెండి పథకాలు సాధించారు.
పథకాలు సాధించిన వారిని కాయ్ రాష్ట్ర అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వి నరేందర్, కోశాధికారి సాయికుమార్, జపాన్ సిటోర్ యు కరాటే రాష్ట్ర అధ్యక్షులు, కాయ్ రిఫరీ కమిషన్ చైర్మన్ పి పాపయ్య,మాడ సంపత్, ఆర్గనైజర్ నాగలక్ష్మి సర్వేష్ ఇన్స్ట్రక్టర్ మెట్టు హాసినిలు అభినందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *