సిరాన్యూస్, ఓదెల
బాధిత కుటుంబానికి సాయం
ఓదెల మండలం లోని గుంపుల గ్రామానికి చెందిన మేకల కిషోర్ అనే యువకుడు గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యం తో చికిత్సా పొందుతూ మృతి చెందారు. మంగళవారం తాళ్ల పెళ్లి ఆగయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ 25 కేజీల బియ్యం నిత్యవసర వస్తువులను బాధిత కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మడ్డి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ఉప్పుల సంపత్ కుమార్, తీగల రాకేష్ గౌడ్ ,ఆరెపల్లి సంపత్ తో పాటు తదితరులు ఉన్నారు.