Talla Rajender:టీజీటీలో ఉద్యోగం సాధించిన బొమ్మనపల్లి యువకుడు

సిరా న్యూస్, చిగురుమామిడి
టీజీటీలో ఉద్యోగం సాధించిన బొమ్మనపల్లి యువకుడు
సంక్షేమ గురుకులాల్లో 4006 టీజీటీ పోస్టుల ఫలితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ఇందులో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలము బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తల్లా రాజేందర్ అనే యువకుడు జోన్ -2 లో టీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు.రాజేందర్ హైదరాబాద్ లోని ఉస్మానియ యూనివర్సిటీ నిజాం కాలేజీలో ఏంఏ ఇంగ్లీష్ పూర్తి చేశాడు.ఈ నెల 4న సాయంత్రం 4గంటలకు ఏల్బి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు.ఉపాధ్యాయుడిగా ఎన్నిక కావడం పట్ల గ్రామ యువకులు, స్నేహితులు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *