Tamsi-k Akshinthalu: తాంసి–కేలో అయోధ్య అక్షింతలు

సిరా న్యూస్, భీంపూర్‌:

తాంసి–కేలో అయోధ్య అక్షింతలు

ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం తాంసి కే గ్రామంలో అయోధ్య అక్షింతలను ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఈ మేరకు ఆంజనేయుని ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు. శ్రీ రామ జన్మ భూమి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన అక్షింతలతోపాటు, శ్రీరాముని చిత్రపటాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ అక్షింతలను అందించారు. మహిళలు మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొనగా, యువకులు భజనలు చేసారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగా వాతావరణం నెలకొంది. రామనామస్మరణతో భక్తులు పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రవీందర్, వినోద్‌ యాదవ్, ప్రభాకర్, శంకర్, విజయ్, నిలేష్, దేవిదాస్, హనుమంత్‌రావ్, భూమన్న, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *