ఆ ఆరింటిపై తర్జన భర్జనలు

సిరా న్యూస్,విజయవాడ;

ఆరు అసెంబ్లీ స్థానాలకు టీడీపీకి చికాకుగా మారాయా? పోటీ చేస్తున్న 144 నియోజకవర్గాల్లో 139 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ 6 నియోజకవర్గాలను ఎందుకు వదిలేశారు? పెండింగ్ స్థానాలపై ప్రత్యేక వ్యూహం ఉందా? లేక సమర్థులు లభించకపోవడమే కారణమా? ఆరు సీట్లపై టీడీపీ చేస్తున్న కసరత్తు ఏంటి? ఆ ఆరు చోట్ల సైకిల్ స్లోగా మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటి?టీడీపీ పెండింగ్ పెట్టిన ఆరు స్థానాల్లో దాదాపు నాలుగు చోట్ల సీనియర్ నేతలు టికెట్లు ఆశిస్తుండటం, అక్కడ ప్రత్యర్థులు బలంగా ఉండటంతో ఆచితూచి వ్యవహరిస్తోంది సైకిల్ పార్టీ. ఉత్తరాంధ్రలోని చీపురుపల్లి, భీమిలి.. దక్షిణ కోస్తాలోని భీమిలి, రాయలసీమలోని అనంతపురం అర్బన్, గుంతకల్లు, ఆలూరు, రాజంపేట స్థానాలను పెండింగ్ లో పెట్టింది.ఈ 6 స్థానాల నుంచి టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, గుమ్మనూరు జయరాం, ప్రభాకర్ చౌదరి వంటి సీనియర్లు టికెట్లు ఆశిస్తున్నారు. అయితే సీనియర్లుగా చెప్పే ఈ నేతలను వారి సొంత నియోజకవర్గాలు కాకుండా వేరే నియోజకవర్గాలకు మారమని అనడంతోనే సమస్య ఎదురైంది. టికెట్ల ప్రకటన పెండింగ్ పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *