సిరా న్యూస్ కుందుర్పి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం కలిగులిమి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బి.తిప్పే స్వామి (55 ) శుక్రవారం, మధ్యాహ్నం అనారోగ్య కారణాలవల్ల ఆకస్మికంగా చనిపోయారు. ఆయన అంకిత భావంతో టీడీపీలో నిబద్దతగా పనిచేసేవారు. వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని కుందుర్పి మండల తెలుగుదేశం పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.