TDP: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అంద‌జేత‌

సిరాన్యూస్, కళ్యాణదుర్గం
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అంద‌జేత‌
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం రూరల్ మండలం గ‌ల కామక్కపల్లి గ్రామానికీ చెందిన కురుబ గంగన్న ఆకస్మికంగా మృతి చెందారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ నాయకుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు సూచన మేరకు ఆయన భౌతిక దేహానికి టీడీపీ నాయ‌కులు పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసారు.ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ దొడగట్ట నారాయణ, జిల్లా కార్యదర్శి& క్లస్టర్ ఇంచార్జ్ తలారి సత్యప్ప, గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశులు, కామక్కపల్లి నాగరాజు, మంజునాథ్, వేణు, నరేష్, రంజిత్, గూబనపల్లి తిమ్మప్ప, వర్లి రాజు, గోళ్ళ వన్నూరు స్వామి, నాగరాజు, రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *