సిరాన్యూస్, కళ్యాణదుర్గం
వన్నూరు స్వామికి 40వేలు ఆర్థిక సాయం: టీడీపీ
* మూడు నెలల సరిపడు నిత్యావసర సరుకులు పంపిణీ
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన పశువుల వన్నూరు స్వామికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి.అస్పత్రిలు చుట్టూ తిరిగి ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకుని అనాథగా మిగిలి ఆర్థికంగా పూటగడవ లేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ వారు స్పందించి రోగికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేసి, మూడు నెలల సరిపడు నిత్యావసర సరుకులు అందజేశారు. భవిష్యత్ లో కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని వారి భరోసా ఇచ్చారు. గ్రామ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలోరూ.25వేలు ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ వెంకటేశులు, మారెప్ప, రంగారెడ్డి, మల్లికార్జున, రామాంజినేయులు, మల్లయ్య పాల్గొన్నారు.