సిరా న్యూస్,కొలిమిగుండ్ల;
కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక జ్వాలా కాంప్లెక్స్ లో లైట్ మోర్ అనే ప్రైవేట్ హాస్పిటల్లో వచ్చి రాణి వైద్యులతో రోగులకు వైద్య సేవలు అందిస్తుండడంతో చాలామంది రోగులు ఈ హాస్పిటల్ లోనే వికటించి దాదాపు 5 మంది చనిపోయినట్లు మండలంలోని చర్చించుకుంటున్నారు. కొలిమిగుండ్ల గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త పేరం రామచంద్రారెడ్డి అనారోగ్యంతో హాస్పిటల్ కి వెళ్లి పరీక్షలు చేయించుకోగా వైద్యం రాని వారితో రామచంద్రారెడ్డికి వైద్య సేవలు చేయడం వల్ల వైద్యం వికటించి మృతి చెందినట్లు మృతుని బంధువులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యం వికటించి రామచంద్రారెడ్డి చనిపోవడంతో విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆగ్రహానికి లోనై లైట్ మోర్ అనే హాస్పిటల్ పై రాళ్లతో దాడి చేయగా హాస్పిటల్ అద్దాలు ధ్వంసం అయినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రైవేట్ హాస్పిటల్ లో నకిలీ వైద్యులు వైద్యం చేయడంతో ప్రజల ప్రాణాలు గాలిలోకి కలిసిపోతున్నాయని ఇంకా మరిన్ని ప్రాణాలు గాలిలోకి కలిసిపోక ముందే జిల్లా వైద్యాధికారులు ఈ ప్రైవేట్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని కొలిమిగుండ్ల మండల ప్రజలు కోరుతున్నారు.