రిషికొండపై టీడీపీ జెండా

సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ రుషికొండపై టీడీపీ శ్రేణులు టీడీపీ జెండాను రేపరేప లాడించారు.జగన్ రెండోసారి అధికా రంలోకి వచ్చాక విశాఖ రాజధానిగా రిషికొండ నుంచే పాలన చేస్తారనే సంకే తాలు ఇచ్చిన వైఎస్సార్సీపీ నేతలు రిషికొండపై నుంచే తన పాలన ఉండా లని ఎంతో ముచ్చటపడ్డారు. ఆది నుంచి రిషికొండపై రహస్యంగా కార్య కలపాలను కొనసాగించిన జగన్ సర్కార్ చివరికి హై కోర్టును కూడా తప్పుదారి పట్టించారనే టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. రిషికొండపై నిర్మాణాల కోసం వందల కోట్లు ఖర్చు చేశారు. ఉన్నతాధికారులు సైతం ఈ నిర్మాణా ల్లో అత్యుత్సాహం చూపారని, కోర్టును తప్పదోవ పట్టించారనే ఆరోపణరు కొండ లున్నాయి.అయితే ఎన్నికల ఫలితాలు వైసీపీకి పెద్ద షాకిచ్చా యీ.కూటమికి స్పష్టమైన మెజారిటీ రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఋషికొండపై టీడీపీ జెండాను ఎగుర వేశారు.
======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *