తెదేపా నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలు

సిరా న్యూస్,నందిగామ;
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో అభిమానులు కార్యకర్తలు సంబరాలు నిర్వహిస్తున్నారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాదయాత్రగా ఆలయాలకు వస్తావని కార్యకర్తలు నేడుగా కార్యక్రమాన్ని నిర్వహించారు పెనుగంచిప్రోలు కు చెందిన మహిళలు దేవస్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పాదయాత్రగా వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. జగ్గయ్యపేట పట్టణంలోని వినాయకుడి గుడి వద్ద నుంచి మహిళలు పాదయాత్రగా తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామానికి చెందిన యువకులు లింగగూడెం గ్రామం నుంచి పాదయాత్రగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ముక్కులు చెల్లించుకుని అనంతరం అక్కడ నుంచి గుణదల మేరీమాత వద్ద మొక్కలు చెల్లించుకుని ఉన్నారు. నందిగామ పట్టణానికి చెందిన తెలుగు యువత నాయకులు నందిగామ తంగిరాల సౌమ్య కార్యాలయం నుంచి పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టారు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుని ఉన్నారు రాష్ట్రంలో వైకాపా దుర్మార్గ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలి గిందని, అందుకే ఆలయంలో మొక్కులు తీర్చుకు వేందుకు వెళుతున్నామని వారు తెలిపారు.
=======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *