మండల తహశీల్దార్ మల్లిఖార్జున స్వామి కలిసిన మంత్రాలయం తెదేపా సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య
సిరా న్యూస్,కౌతాళం;
సోమవారం నాడు నూతనంగా మండల తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన మల్లిఖార్జున స్వామి ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ,ప్రజలకు మెరుగైన ప్రజాసేవ, సంక్షేమం,విద్య,వైద్యం మరియు రైతన్నలకు సేవ అందించాలని కోరుతూ రాజకీయ నాయకులకు మరియు అధికారులకు స్నేహపూర్వకమైన బంధంతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమములో సీనియర్ నాయకులు రామలింగ ,,కురువ విరేష్, రాజనంద ,లక్కే గోవిందు,యువ నాయకులు *తెలుగు యువత సతీష్ నాయుడు,సురేష్ నాయుడు ,,ముఖన్న, కాకం, జనసేన రామాంజినేయులు,చిరు,అమ్ము వలీ,మల్లయ్య, గొట్టయ్య,గురు,ఈరన్న,రమేష్,పంపన్న,శ్రీరామ్, షేక్,మర్రి గౌడ్,నాగరాజు,సల్మాన్,మైభు మొదలగు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.