సీఎస్ ను కలిసిన టీడీపీ నేతలు

సిరా న్యూస్,అమరావతి;
పింఛన్ల పంపిణీ అంశంపై చలో సచివాలయానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఎన్టీఆర్ భవన్ నుంచి సచివాలయానికి వాహన ర్యాలీగా నేతలు బయలుదేరారు. పింఛన్ల పంపిణీలో కావాలనే జాప్యం చేస్తున్నారని టీడీపీ నేతల ఆరోపణ. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చేలా ఆదేశించాలని సీఎస్ను టీడీపీ కోరింది. సెర్ప్ ఆదేశాలపై సీఎస్ కు ఫిర్యాదు చేసారరు. పెన్షన్లు పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలంటూ సీఎస్ జవహర్ రెడ్డిని కోరారు. సెర్ప్ సర్కులర్ ఈసీ నిబంధలకి విరుద్దంగా ఉందని టీడీపీ ఫిర్యాదు చేసింది.
================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *