సిరా న్యూస్,చిత్తూరు;
చిత్తూరు జిల్లా, కుప్పంలో టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో టిడిపి నేతలు ప్రచార పత్రికకు పూజలను నిర్వహించి, ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు కుప్పం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మునిరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రచార పత్రికను అందజేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి,జనసేన నేతలు నరేష్, రాజ్ కుమార్, ప్రేమ్ కుమార్, ప్రతాప్, సత్యేంద్ర శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.