సిరా న్యూస్,కౌతాళం;
మండల కేద్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కౌతాళం ఎంపీడీవో రఘునాథ్ గుప్తా మరియు సచివాలయం సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప , టీడీపీ కౌతాళం టౌన్ అధ్యక్షులు కాశీ విశ్వనాధ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పింఛన్ దారులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రెండో నెల కూడా ఉదయం ఆరు గంటల నుండి ఇంటి దగ్గరికే పింఛన్ పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. సంక్షేమం అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రాజబాబు,భీమయ్య,శివ తదితరులు పాల్గొన్నారు.