సంక్రాంతి పండుగకు టీడీపీ కొత్త కార్యక్రమం

పల్లె పిలుస్తోంది రా కదలి రా
భోగి మంటల్లో ఫోటోలు దగ్దం చేయాలని పిలుపు
సిరా న్యూస్,విజయవాడ;
. భోగి మంటల్లో ఏపీ సమస్యలపై ఫోటోలు తగలబెట్టాలని పిలుపునిచ్చారు. 14, 15 తేదీల్లో కార్యక్రమం చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. ఏపీకి పట్టిన కీడు తొలగాలని కోరుకుంటూ సమస్యల ఫోటోలను భోగిమంటల్లో వేయాలని టీడీపీ నిర్ణయించింది. 14న స్వయంగా కార్యక్రమంలో పాల్గొనే యోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు వున్నట్లు సమాచారం. ఈనెల 15న రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ముగ్గులుగా వేయాలని టీడీపీ పిలుపునిచ్చింది. ముగ్గుల సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని టీడీపీ నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *