సిరా న్యూస్,కొత్తపేట;
ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామం లో వైసీపీ నాయకుడు పై టీడీపి వర్గీయులు దాడి జరిపారు. సోమవారం పోలింగ్ బూత్ వద్ద గబ్బర్ సింగ్ అనే టీడీపీ నాయకుడు పై జరిగిన వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని మంగళవారం ఉదయం తమ కార్యకర్తలను వెంటబెట్టుకుని వైసీపీ నాయకుడు నెంబర్ వన్ గోపి పై దాడికి దిగారు. సుమారు యాభై మంది కలిసి పిడిగుద్దులు కురిపించారరు. దాడి లో గాయపడ్డ వైసీపీ నేతను పోలీస్ లు 108 లో హాస్పిటల్ కు తరలించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేసారు.
===================