సిరాన్యూస్,బేల
పెన్గంగా పరివాహక ప్రాంతాలను పరిశీలించిన తహసీల్దార్ వామన్
భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామాన్ని అనుకొని ఉన్న పెన్ గంగా పరివాహక ప్రాంతాలైన సాంగిడి, భేదొడా, గూడా, తది తర ప్రాంతంలో వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం తహసీల్దార్ వామన్, పలు శాఖల అధికారులు పెన్ గంగా పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రంలో నీరు చేరడం గమనించారు. పూర్తి సమాచారం సేకరించి పై అధికారులకు విన్నవించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో ఉండే ప్రజలను ఎప్పటికప్పుడు గ్రామంలో ఉండే అధికారులు అడిగి వారి పరిస్థితిలను తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారి.నేర్ల మహేందర్, వ్యవసాయ అధికారి వినయ్ కుమార్, గ్రామ కార్యదర్శి గౌతమ్, ఎంపీఓ వినోద్ కుమార్, పోలిస్ అధికారి, గ్రామ ప్రజలు, సాసన్ నరేష్,సంతొష్ గౌడ్, తది తరులు పాల్లొన్నారు.