త్వరలో అందుబాటులోకి టేకుమట్ల – రాఘవరెడ్డిపేట వంతెన

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
త్వరలోనే టేకుమట్ల – రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య చలివాగుపై నిర్మిస్తున్న హైలెవల్ వంతెన నిర్మాణ పనులను పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే తొంభై శాతం నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. 2023 జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలోని టేకుమట్ల – రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య చలివాగుపై ఉన్న వంతెన పిల్లర్లు కూలిన విషయం తెలిసిందే. అట్టి బ్రిడ్జి పిల్లర్ల నిర్మాణ పనులను రూ.4.70 కోట్లతో చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తక్కువ సమయంలోనే వంతెన నిర్మాణంను పూర్తి చేసి, వాగవతలి తొమ్మిది గ్రామాలకు రాకపోకల సౌలభ్యం చేస్తున్న సదరు గుత్తేదారుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట టేకుమట్ల మండల పార్టీ అధ్యక్షుడితో పాటు పలువురు మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *