Telangana: బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు

సిరా న్యూస్, హైదరబాద్‌:

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు
– త్వరలో మంత్రి వర్గ విస్తరణ
– కీలక శాఖల్లో మార్పులకు అవకాశం

తెలంగాణలో త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నందున, బీఆర్‌ఎస్‌ నుండి కాంగ్రెస్‌లోకి చేరిన పలువురు సీనియర్లకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రి వర్గ విస్తరణతో పాటు కీలక శాఖల్లో సైతం మార్పులకు ముఖ్యంత్రి రేవంత్‌ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మంత్రి వర్గంలో మరో ఆరు గురికి అవకాశం ఉండగా బీఆర్‌ఎస్‌ నుండి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఖాయమని అంతా భావిస్తున్నారు. పోచారం శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరే సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే పోచారంకు మంత్రి పదవి పక్కా అని తెలుస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన తరువాత సీఎం రేవంత్‌ రెడ్డి పారిపాలనతో పాటు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తుంది. గ్రేటర్‌ హైదరబాద్‌ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కకపోవడంతో ఈ సారి ఎలాగైన గ్రేటర్‌లో సత్తాచాటాలని సీఎం నిర్ణయించుకునట్లు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే పార్టీలో చేరికలను ప్రొత్సహిస్తున్నట్లు వినికిడి.

మంత్రివర్గం రేసులో పలువురు…

పోచారం శ్రీనివాస్‌తో పాటు గడ్డం వినోద్, ప్రేమ్‌ సాగర్‌ రావ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మల్‌ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌ రెడ్డిలతో పాటు మరికొంత మంది ఆశావాహులు మంత్రి వర్గ రేసులో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే చర్చ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ప్రజలు ఆసక్తికరంగా గమనిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *