Telangana Ambedkar Association: రాజ్యాంగాన్ని రక్షించడమే లక్ష్యం

సిరాన్యూస్‌,భీమదేవరపల్లి
రాజ్యాంగాన్ని రక్షించడమే లక్ష్యం
* తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయ‌కులు
* కొప్పూరు నూతన కమిటీ ఎన్నిక‌
రాజ్యాంగాన్ని రక్షించడమే లక్ష్యమ‌ని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతరాజు లాలయ్య అన్నారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయడానికి అనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో కమిటీలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే కొప్పూరు గ్రామంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం నూతన కమిటీ వేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి తూముల సదానందం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాల ప్రకాష్ అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు జేఏసీ చైర్మన్ సారయ్య ఆధ్వర్యంలో మండలంలో కొప్పూరు గ్రామంలో నూతన కమిటీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి భీమదేవరపల్లి మండలంలోని కన్వీనర్లు బొల్లంపల్లి రాజు ఎల్తూరి ప్రేమ్ రాజు ,కో కన్వీనర్ కొమ్ముల రవీందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గతంలో అంబేద్కర్ సంఘాలు బలేపేతంగా పనిచేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింద‌న్నారు.కార్యక్రమానికి భీమదేవరపల్లి మండల కన్వీనర్లు బొల్లంపల్లి రాజు ఎల్తూరి ప్రేమ్ రాజు, మాజీ ఎంపిటిసి బిక్షపతి, బొల్లంపల్లి రమేష్ ముల్కనూర్ ఎంపిటిసి అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు తాళ్లపల్లి అశోక్ ,కొప్పూరు నూతన అంబేద్కర్ సంఘం గ్రామ కమిటీ అధ్యక్షులు కొమ్ముల రవీందర్,ఉపాధ్యక్షులు మంద రాజు ప్రధాన కార్యదర్శి గడిపే రమేష్ ప్రచార కార్యదర్శి సుంచు సతీష్, కార్యదర్శి సహాయ కార్యదర్శి కోశాధికారి కొమ్ముల రవీందర్ కార్యవర్గ సభ్యులు ప్రసాద్ తూముల ఎర్ర మొగిలి కొమ్ముల కుమారస్వామి, బిక్షపతి, తూముల రాజమౌళి చంద్రమౌళి కొమ్ముల రాజేందర్, గౌరవ సలహాదారులుగా కొమ్ముల వీరస్వామి, అంబానీ చక్రపాణి కొమ్ముల రవీందర్ గడిపే బిక్షపతి మాజీ ఎంపిటిసి గడిపి ఐలయ్య గడిపే కొమురయ్య సుంచు కుమార స్వామి, ముత్తారం అంబేద్కర్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు రేణిగుంట్ల ప్రసాదు, దళిత నాయకులు తాడూరు చిరంజీవి, సుంచు, రమేష్, దళిత నాయకులు నలగొండ మురళి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *