సూర్యాపేట బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

సిరా న్యూస్,సూర్యాపేట జిల్లా;
సూర్యాపేట జిల్లా ఉత్సవాల్లో పాల్గొన్న కోదాడ మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ,పార్టీ అధ్యక్షులు,మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ .తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర సాధకులు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాను సారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 1 నుండి 3 వరకు వివిధ కార్యక్రమాలు చేయాలనీ పార్టీ శ్రేణులకు దిశనిర్దేశం చేశారు. అందులో భాగంగా ఈరోజు సూర్యాపేట పార్టీ కార్యాలయంలో ముగింపు ఉత్సవాల్లో కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల కాలంలో కెసిఆర్ గారి పాలనలో అన్ని రంగాలలో దేశంలో లేని అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడింది.24 గంటల కరెంటు,రైతుభిమ,రైతుబందు,కళ్యాణలక్ష్మి వంటి అనేక పధకాలు ప్రవేశపెట్టిన ఘనత మన కెసిఆర్ గారికే దక్కుతుంది.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 6నెలలు అయినా కుడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైనదని ద్వజమెత్తారు.ఇకనైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని లేని పక్షంలో హామీలు నెరవేర్చవరకు మరొక ఉద్యమం తప్పదు అని అన్నారు.ఇట్టి కార్యక్రమం అనంతరం సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ లో వివిధ ఇబ్బందులలో చికిత్స తీసుకుంటున్న పెషేంట్లకీ పండ్లు,ఫలహారాలు ఇచ్చి అధైర్యపడవద్దు అని మనోధైర్యం ఇచ్చారు.ఇట్టి కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గుజ్జ దీపిక, జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *