Telangana State Gazetted Officers Association :ఆదిలాబాద్ జిల్లా నుంచే సభ్యత్వ న‌మోదు

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
ఆదిలాబాద్ జిల్లా నుంచే సభ్యత్వ న‌మోదు
*తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం కేంద్ర కమిటీ సభ్యులు

రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అదిలాబాద్ జిల్లా నుండి ప్రారంభించడం జరిగిందని తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం కేంద్ర కమిటీ సభ్యులు ఏలూరి శ్రీనివాసరావు , సత్యనారాయణ అన్నారు. మంగ‌ళ‌వారం జిల్లాలోని వివిధ శాఖల్లోని గెజిటెడ్ అధికారుల తో సమావేశమై రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అదిలాబాద్ జిల్లా నుండి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అధికారులందరూ తమ సభ్యత్వాన్ని తీసుకొని రాబోవు 10 నుండి 15 రోజుల్లో రాష్ట్రంలో కొత్త కమిటీని పారదర్శకంగా ఎన్నుకోవడం జరుగుతుందని తెలియజేశారు .అదేవిధంగా జిల్లాలో కూడా కొత్త కమిటీని పారాదర్శనంగా ఎన్నుకోవటం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు ఏలూరు శ్రీనివాసరావు, సత్యనారాయణ , శ్యామ్ , పరమేశ్వర్ రెడ్డి , ఉపేందర్ రెడ్డి , డాక్టర్ రాజేశ్వర, డాక్టర్ కే రామారావు ల‌ను అదిలాబాద్ జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం తరఫున సహధ్యక్షులు శ్రీ కే శివకుమార్, మాజీ జనరల్ సెక్రెటరీ శ్రీ రాజేందర్ దేశ్పాండే , వైస్ ప్రెసిడెంట్ డా.రామారావు రాథోడ్ సన్మానించారు.ఈకార్యక్రమంలో సంఘ సభ్యులు ఎండి.అష్రఫ్ అహ్మద్, భగత్ రమేష్, శ్రీనివాస్ రెడ్డి, విశ్వ మిత్ర, డాక్టర్ రజనీకాంత్ రెడ్డి, డాక్టర్ గజానంద్, బాబులల్ రాథోడ్, అనిల్, శ్రీనివాస్, రాజేష్, సిరాజ్అలి, భూమయ్య, రాజేశ్వర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *