సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోదాడ నందు ఈరోజు 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జండా ఆవిష్కరణ చేసి కేక్ కటింగ్ చేసి నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి ఓరుగంట ప్రభాకర్ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ త్వరలో పూర్వ వైభవం వస్తుందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని గత 20 సంవత్సరాలు నుండి పార్టీకోసం నిరంతరం అహర్నిశలు జండా మోస్తున్న కార్యకర్తలకు భవిష్యత్తులో సంచిత స్థానం వస్తుందని పార్టీకి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసినారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు జనపనేనికృష్ణారావు, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు, చిలుకూరు మండల పార్టీ అధ్యక్షులు సాతులూరు గురవయ్య ,వేమూరి సురేష్ ,రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు అమరవరపు శ్రీమన్నారాయణ,పట్టణ ఉపాధ్యక్షులు బైక్ నాగులు, చింతల కొండలు, టేకుమట్ల దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.