సిరా న్యూస్,భద్రాద్రికోత్తగూడెం;
భద్రాద్రికోత్తగూడెం జిల్లాలో మూడు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో కోల్ బెల్ట్, పారిశ్రామిక ప్రాంతం కావటంతో సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఏప్రిల్ మాసంలో ఈరెంజ్ లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్ళకే పరిమితమవుతున్నారు. సుజాతనగర్, భద్రాచలంలో 43.3, చుంచుపల్లి గరిమెల్లపాడులో 43.2, నాలుగు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తొమ్మిది ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు, 8ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి
===============