సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ ముందు వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీని డీకొట్టింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఏలూరు గ్రామం నుంచి అరుణాచలం వెళుతుంటే ప్రమాదం జరిగింది. ప్రయాణికులు పశ్చిమగోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని చిల్లకూరు వద్ద ఇవాళ తెల్లవారుజామున కోట క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఏలూరు గ్రామం నుండి అరుణాచలం వెళుతున్న ఓ టెంపుల్ ట్రావెలర్ ముందు వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీని డికొట్టింది. పదిమందికి స్వల్ప గాయాలు అయ్యాయి. నలుగురికి ఎక్కువ మోతాదులో దెబ్బలు తగిలాయి. తలలు ఒంటిమీద గాయాలు అందులోఇద్దరి కాళ్లు చేతులు విరిగిపోయాయి. క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు…