సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ జిల్లా గాజువాక అదానీ గంగవ రం పోర్టులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిర్వాసిత కార్మి కులు రెండు గేట్లకు తాళాలు వేసి, వారం రోజులుగా ఆందోళన చేస్తు న్నారు.పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్, జిల్లా కలెక్టర్ మల్లికార్జున సమక్షంలో 8నెలల క్రితం చర్చలు జరిగాయని, తమ డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని, కానీ ఇంతవరకూ వాటిని నెరవేర్చకపోవడం వల్లే ఆందోళన చేస్తున్నామని కార్మికు లు చెబుతున్నారు. నాడు మంత్రి, కలెక్టర్.. ఇప్పుడు స్పందించడం లేదని, యాజమాన్యం మొండివైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తున్నారు. పదిహేనేళ్ల నుంచి పనిచేస్తున్నా రూ.30వేల జీతం రావడం లేదని వాపోతు న్నారు. విశాఖ పోర్టులో అదే పనిచేస్తున్న వారికి 17వేల బేసిక్ పే ఇస్తున్నారని, తమకు ఎందుకివ్వరని వారు ప్రశ్నిస్తున్నారు. తమ జీవనోపాధిని పోగొట్టుకొని పోర్టు కోసం భూములు ఇచ్చామని, యాజమాన్యానికి భారీ లాభాలు వస్తున్నా వేతనాలు ఎందుకు పెంచరని ప్రశ్నిస్తున్నారు.