నెల్లూరు నగరంలో ఉద్రిక్తత

సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు నగరంలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. రోడ్లపై తిరుగుతున్న పశువులను అధికారులు గోశాలకు తరలించడానికి ప్రయత్నించారు. పశువుల యజమానులు మూగజీవాలను రోడ్లపై అడ్డదిడ్డంగా మూగజీవాలను వదిలేస్తున్నారు. మూగజీవాలను గోశాలలకు తరలించాలని మంత్రులు, అధికారులు ఆదేశాలు జారీ చేసారు. శుక్రవారం నాడు కార్పొరేషన్ అధికారులు పశువులను పట్టుకుని 48వ డివిజన్ కు తరలించారు. అక్కడి నుంచి గోశాలకు తరలిస్తుండగా పశువుల యజమానులు అడ్డుకున్నారు. పలువురు నేతలను తీసుకువచ్చి కార్పొరేషన్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులను అడ్డుకుని పశువులను బలవంతంగా విడిపించారు. దాంతో మూగజీవాలు ఒక్కసారిగా పరుగులు తీసాయి. పశువులు రొడ్లపై తిరగడంలో వాహనాదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *