విజయవాడలో ఉద్రిక్తత

సిరా న్యూస్,విజయవాడ;
బుధవారం నాడు విజయవాడలో రాష్ట్ర స్థాయి సాంప్రదాయ మత్స్యకార ప్రతినిధుల కీలక రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ నేపధ్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకిదిగారు. విజయవాడలోని రాఘవయ్య పార్క్ ఎదురుగా ఎంబీ భవన్ లో సాంప్రదాయ మత్స్యకార ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం వేదిక వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. మా సమస్యలపై చర్చించడానికిరౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించుకోకూడదా అంటూ పోలీసులపై సాంప్రదాయ మత్స్యకార ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *