వైఎం తండాలో ఉద్రిక్తత

సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని వైఎం తండా వద్ద హుజూరాబాద్ నియోజక వర్గం జమ్మికుంట మున్సిపల్ అవిశ్వాసానికి సంబంధించి రగడ జరుగుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల నాటకీయ పరిణామాల మధ్య వైయం తండా వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆయా పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరోవైపు మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ తమ పార్టీల తరఫున మద్దతుగా సంఘటన స్థలానికి చేరుకొని వాగ్వివాదం పెట్టుకున్నారు.ఇరువురు నాయకులు వాదోపవాదాలు చేస్తుండడంతో తమ అనుచర నాయకులు రెచ్చిపోయారు.

హుజరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలో చైర్మన్ గా ఉన్న రాజేశ్వర రావు (బీఆర్ఎస్) పై ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన పొన్నగంటి మల్లయ్య (కాంగ్రెస్) వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టింది.. మొత్తం 30 వార్డులు ఉండగా ఇరువురికి 15 చొప్పున సమ బలాలు ఉన్నాయి. ఇందులో ఓ వర్గం కౌన్సిలర్లను కొత్తూరు శివారులోని ఫామ్ హౌస్ లో దాచినట్లు సమాచారం.. ఇప్పుడు వీరి కోసం నాయకులంతా రోడ్డుపై పడ్డారు కౌన్సిలర్ల కోసం ఒకరిని ఒకరు తన్నుకుంటున్నారు. ఇదిలా ఉండగా కొత్తూరు మండలం మాజీ జడ్పీటిసి శ్యామ్ సుందర్ రెడ్డి, కేశంపెట్ ఎంపిపి రవి యాదవ్ మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది.. రంగప్రవేశం చేసిన పోలీసులు వేల సంఖ్యలో గుమికూడిన బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులను , కార్యకర్తలను చెదరగొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *