సిరాన్యూస్, తలమడుగు
అజ్ఞనాన్ని తొలగించే అఖండ జ్యోతి శబరమ్మ: బలరాం జాదవ్
అజ్ఞనాన్ని తొలగించే అఖండ జ్యోతి శబరమ్మ అని తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం అర్లి (కే) గ్రామంలో సద్గురు శ్రీ శబరిమాత అఖండజ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు. శ్రావణమాసంలో అమ్మవారి జ్యోతి నిరంతరంగా మాసం పాటు వెలుగుతుంది. అమ్మవారు నిత్యం అలంకరణతో భక్తులకు దర్శనమిస్తారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక భావం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈసందర్బంగా బలరాం జాదవ్ మాట్లాడుతు అర్లి గ్రామం అన్ని రంగాల్లో ముందుందని భక్తిలో కూడా ముందుందని కొనియాడారు. ఆధ్యాత్మికచింతన అనేది ప్రస్తుత జీవన విధానానికి అవసరమని, దీని వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.ఈ అఖండజ్యోతి 30 రోజులపాటు దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులకు శభరమ్మ రూపంలో దర్శనమిస్తుందని అన్నారు. ప్రతీ సంవత్సరం ఒక్కో ఊరిలో వెలుగుతుందని ఈ సంవత్సరం మన అర్లి గ్రామంలో శబరిమాత అఖండజ్యోతి వెలిసిందని అన్నారు. భగవన్నామస్మరణతో భక్తులు ప్రశాంతతను పొందుతారని అన్నారు. పిలవగానే వచ్చిన బలరాంకు గ్రామ కమిటి సభ్యులు శాలువాతో సత్కరించారు.