TGB Awareness: బ్యాంక్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

సిరా న్యూస్, భీంపూర్‌:

బ్యాంక్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

తమ బ్యాంక్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, ఏటీఎం, రైతు రుణాలు, ఆర్‌డీ, ఎఫ్‌డీ వంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రవీణ్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలోని బుర్కాపూర్‌ గ్రామంలో డ్రీమ్‌ సొసైటీతో కలిసి అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ మోసాలు జరుగుతున్న తీరును గురించి వివరించారు. ఏటీఎం కార్డు, పిన్‌ వివరాలు అపరిచితులకు చెప్పరాదన్నారు. మొబైల్‌ ఫోన్లకు వచ్చే ఓటీపీల విషయంలో అత్యంత జాగ్రతగా ఉండాలన్నారు. సైబర్‌ మోసాలు నానాటికి పెరుగుతున్న తరుణంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్‌ సొసైటీ కోఆర్డినేటర్‌ జంగుబాబు, గ్రామస్తులు, ఖాతాదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *