సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కొనుగోళ్లకు త్వరలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని తీసుకొస్తామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్, బండ్లగూడ డిపోల్లో అమలు చేస్తామని, కొద్ది రోజుల్లోనే అన్ని డిపోల్లో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.