సిరా న్యూస్, ఆదిలాబాద్:
టీజీటీలకు ఘన సన్మానం…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పిప్పర్వాడ గ్రామానికి చెందిన వైలే రమేష్, బేల మండలం అవల్పూర్ గ్రామానికి చెందిన గన్నోజివార్ నిషికాంత్లను సహా ఉపాద్యాయులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఇటీవల విడుదల చేసిన టీజీటీ పరీక్షా ఫలితాల్లో ఉద్యోగాలు సంపాదించడంతో, ఈ మేరకు వారికి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో సహోపాద్యాయులు సిల్వర్ నవీన్, భూమన్న, రవీందర్ రెడ్డి, రాజేష్, జగదీష్, రమేష్, రాజు రెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.