సిరాన్యూస్,ఇచ్చోడ
ఏజెన్సీ ప్రాంతంలో ఫీజుల దోపిడీని అరికట్టాలి
* తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రెటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్
ఏజెన్సీ ప్రాంతంలో ఫీజుల దోపిడీని అరికట్టాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ,రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రెటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే యూనిఫామ్, బుక్స్, బోట్లు టైలు, పాఠశాలలోనే దుకాణాలు తెరిచి బహిరంగంగానే అమ్ముతున్నారని తెలిపారు. వేలాది రూపాయలు తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారని, ఈ తతంగమంతా తెలిసినప్పటికీ కూడా ఉన్నత విద్యాధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఉన్నత విద్యాధికారులు స్పందించి అన్ని ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బోథ్ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల నరేందర్ ,కో కన్వీనర్ సతీష్ , సాయి, గణేష్, పవర్, సురేష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.