సిరా న్యూస్, తలమడుగు:
మహిళా విద్యకు బాటలు వేసిన మహనీయురాలు…
మహిళా విద్యకు బాటలు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని, బ్లూ భీమ్ యూత్ అధ్యక్షులు గోంటి ముక్కుల ప్రేమేందర్ అన్నారు. తలమడుగు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రి భాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే అని అన్నారు. ప్రతి ఒక్కరు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సావిత్రి భాయి ఫూలే జయంతిన పురస్కరించుకొని, వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు ఆయన పలు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎలుగు రాజన్న, ఎస్ఎంసి చైర్మన్ నేతుల గంగన్న, నాయకులు దీలిప్, వసిం, నిఖిల్ రెడ్డి,యూత్ సభ్యులు శేకర్, ప్రశాంత్, రాజు సందీప్, జైపాల్, వంశీ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.