సిరా న్యూస్, కుందుర్పి
ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యండి
* అనంతపురం ఎంపీ తలారి రంగయ్య
* వడ్డెర కాలనీలో ఇంటింటా ప్రచారం
ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. సోమవారం కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని 13 వ వార్డు వడ్డెర కాలనీ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ఇంటి ఇంటికి వెళ్లారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. జగనన్న కు మద్దతుగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.ఈ సంధర్బంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అందించిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలను ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వార్డు ప్రజలకు అందజేశారు. ఈకార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్లొన్నారు.