సిరా న్యూస్, కుందుర్పి
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి
* ఎంపీ తలారి రంగయ్య
* అండేపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం
మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు.
శుక్రవారం కంబదూరు మండల పరిధిలోని అండేపల్లి గ్రామంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు,కార్యకర్తలతో కలిసి గ్రామం లో అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య పర్యటించారు. ఈ సందర్బంగా నాలుగున్నరేళ్లుగా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులుమరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని కోరారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేద్దామని స్థానిక ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు.