thalari Rangaiah:జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం

సిరా న్యూస్, కుందుర్పి
జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం
* అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య
సంక్షేమ రథసారధి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డా. తలారి రంగయ్య అన్నారు. సోమ‌వారం కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని అపిలే పల్లి,మందలపల్లి,జానంపల్లి, బొమ్మజ్జిపల్లి గ్రామాలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు,కార్యకర్తలతో కలిసి గ్రామం లో అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డా తలారి రంగయ్య పర్యటించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న నాలుగున్నరేళ్లుగా కళ్యాణదుర్గం నియోజకవర్గం, కుందుర్పి మండలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులుమరోసారి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని స్థానిక ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు.ఈ సందర్బంగా అపిలేపల్లి గ్రామానికి చెందిన చలం శ్రీరాములు, నాగరాజు,ఓంకార్,రామాంజినేయులు టీడీపి పార్టీ వీడి ఎంపీ డా తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఎంపీ డా తలారిరంగయ్యఆహ్వానించారు.అనంతం అపిలేపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి వారి జాతర సందర్బంగా ప్రమాద వశాత్తూ కుప్పు కూలిన రథాన్ని వారు పరిశీలించి, సంఘటన జరిగిన వివరాలను స్థానికులను అడిగితెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *