సిరాన్యూస్, కళ్యాణదుర్గం
తలారి సొమ్ము వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 15 వ వార్డులో తలారి పరమేశ్వరమ్మ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బిక్కి రామలక్ష్మి గోవిందప్ప వార్డ్ కౌన్సిలర్ తలారిసోము ఆధ్వర్యంలో వారి కుటుంబానికి తక్షణ సహాయం కింద 5,000 రూపాయలు అందజేశారు.మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు తలారి రమేష్, సుగేపల్లి నరేష్, దాసరి వెంకటేశులు, పూజారి నరేష్, బందుకుల రాము, శ్రీనివాసులు, గణేష్, పొగాకుల మోహన్, తలారి ప్రతాప్, పూజారి ఠాగూర్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.