thalliki vandanam : తల్లికి వందనం విధివిధానాలు ఖరారు

సిరా న్యూస్,ఏలూరు;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం కార్యక్రమం కోసం విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం ద్వారా 15 వేల రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు కిట్స్ పంపిణీకి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ పథక లబ్ధిదారుల గుర్తింపునకు ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపుతో ఉన్న ఇతర కార్డులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
లబ్ధిదారులు ఐడెంటిటీగా కింది వాటిలో ఏదైనా ఒకదాన్ని వాడొచ్చు
ఆధార్ కార్డు
డ్రైవింగ్ లైసెన్స్
ఫొటో ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్ బుక్
పాన్ కార్డు
రేషన్ కార్డు
ఓటర్ ఐడెంటిటీ కార్డు
ఎంజీఎన్ఆర్ఈజీఏ కార్డు
ఫొటో ఉన్న కిసాన్ కార్డు
గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ అఫిషియల్ లెటర్ హెడ్
ఏదైనా డిపార్ట్మెంట్ డాక్యుమెంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *