పెందుర్తి ప్రజలందరికి కృతఙ్ఞతలు

సిరా న్యూస్,పెందుర్తి;
ఒక చారిత్రత్మాకమయినా విజయాన్ని రాష్ట్రనికి అందించారని అన్నారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు.. స్థానికి ఒక ప్రైవేట్ కళ్యాణమండపంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఎలాగయినా కాపాడు కోవాలని కూటమికి భారీ విజయాన్ని చేకూర్చారు.. పెందుర్తి ప్రజలు నన్ను ఆదరిస్తారాణి చెప్పడంతో జనసేన అధ్యక్షులు పవన్కళ్యాన్ నన్ను నమ్మి టికెట్ ఇవ్వడం జరిగింది.. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు పెందుర్తి ప్రజలు.. నాపై ఇంకా మరింత బాధ్యత పెరిగింది.. దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజలందరి ఋణం తీర్చుకుంటాను అని అన్నారు.
చాలామంది మిత్రులు ఇక్కడ లోకల్ నాంలోకల్ అని నన్ను అన్నారు.. కానీ పెందుర్తి గడ్డా పంచకర్ల అడ్డా అని తెలియజేసారు ఓటర్లు.. ప్రజలు ఎప్పుడు తప్పుచేయ్యరు.. విషయాలను గ్రహించి ఇక్కడ ఓటుతో సమాధానం చెప్పారు.. ఇక్కడ నన్ను ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు బిజెపి నాయకులకు క్రతఙ్ఞతలు.. జనసేన నాయకులు, కార్యకర్తలు నా కుటుంబసభ్యులతో సమానం అన్నారు పంచకర్ల రమేష్..
వై. సి. పి. లో కూడా చాలామంది ఇక్కడ నాకే పనిచేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పంచకర్ల.. ఇక్కడ పార్టీపారంగా కాకుండా వ్యక్తిత్వం పరంగా వై. సి. పి కార్యకర్తలు సహాయం చేశారు.. వారందరికీ కృతఙ్ఞతలు చెప్తున్నానుని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *