కళాకారులకు గౌరవ వేతనం పెంచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు

సిరా న్యూస్,కమాన్ పూర్;
ప్రజా ప్రభుత్వం సాంస్కృతిక కళాకారులకు గౌరవ వేతనం పెంచడం పట్ల రామగిరి మండలం బేగంపేటకు చెందిన సాంస్కృతిక కళాకారుడు కొండ్ర వెంకన్న గౌడ్ ప్రభుత్వానికి మంత్రులకు కృతజ్ఞత తెలిపారు.
ప్రజపాలనకు కాళాభివందనా లు సాంస్కృతిక సారథి కళాకారులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులను గుర్తించి గత ప్రభుత్వం 583 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి వారికీ స్వరాష్ట్రంలొ తగిన గౌరవం అందించింది గత పది సంవత్సరాలనుండి 24,514 రూపాయల గౌరవ వేతనం ఇచ్చి ఉద్యమ కళాకారులకు తగిన స్థానాన్ని కల్పించింది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటే ఏంటో నిరూపించుకుంది 583 మంది కళాకారులకు 30 % PRC పెంచి 24,514 రూ ఉన్న జీతాన్ని 31,868 రూపాయలకు పెంచి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపింది కళాకారులకు సముచిత స్థానాన్ని ఇచ్చి సారథి కళాకారుల కుటుంబాలలో వెలుగులు నింపినటువంటి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి కి ఐటీ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు కి ఆర్థికశాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క కి సంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కి ట్రాన్స్ ఫొర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి పెద్దపల్లి జిల్లా సారథి కళాకారుల పక్షాన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు కోండ్ర వెంకన్న గౌడ్ కాలాభివందనాలు తెలియ పరిచడం జరిగినది అదేవిదంగా 2020 నుండి 2024 మార్చి మాసం వరకు పెండింగ్ లొ ఉన్న పి ఆర్ సి కూడా త్వరితగతిన కళాకారుల అకౌంట్లలొ జమచేయాలనీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోండ్ర వెంకన్న గౌడ్ కోరుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *