ఆ నగదు..బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనం

ఎమ్మెల్యే అది శ్రీనివాస్
 సిరా న్యూస్,వేములవాడ;
రాజన్న సిరిసిల్ల జిల్లా. పార్లమెంట్ ఎన్నికల నగరా మోగక ముందే బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు చెందిన హోటల్ లో ఆరు కోట్ల రూపాయలు అర్ధరాత్రి దొరకడం, ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అవినీతికి నిదర్శనమని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తన నివాసంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులైన వినోద్ కుమార్ కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడని, వినోద్ కుమార్ కు సంబంధించిన హోటల్లో దొరికిన నగదు పై కేసీఆర్ సమాధానం ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఆ పార్టీకి వరంగా మారిందని, తెలంగాణ ప్రజల నుండి దోచుకున్న డబ్బులను మహారాష్ట్రలో బిల్డింగులు కొనుగోలు చేశారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలను ప్రజలు గమనించి కర్రు కాల్చి వాత పెట్టారని, ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి పరాభవం తప్పదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *