గోదావరిఖని లేబర్ కార్యాలయం పై వస్తున్న ఆరోపణలు అవాస్తవం

సిరా న్యూస్,కమాన్ పూర్;

గోదావరిఖని లేబర్ కార్యాలయం పు లేబర్ ఆఫీసర్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి అన్నారు. రామగిరి మండలం భవన నిర్మాణ కార్మికుల కార్యాలయంలో శుక్రవారం నాడు గ్రామ అధ్యక్షుడు ఎస్ కె షరీఫ్ జనరల్ సెక్రెటరీ కుసుమ సురేష్ ఏర్పాటుచేసిన సమావేశంలో స్వామి మాట్లాడుతూ లేబర్ కార్యాలయం పై కొంతమంది పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి ఆరోపణలు మానుకోవాలన్నారు.ఇప్పుడున్న లేబర్ అధికారి సకాలంలో మా కార్మికులకు లేబర్ కార్డు క్లెయిమ్స్ రూపాయి ఆశించకుండా సకాలంలో అందిస్తున్నారని అన్నారు.ఇంతకు ముందున్న అధికారి ఆఫీస్ కి వెళ్లిన పనులు జరిగేవి కావని, ఇప్పుడున్న అధికారి ఒక ఫోన్ కాల్ తోనే స్పందిస్తూ కార్మికుల సమస్యలను తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలను మానుకోవాలని ఇతవు పలికారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ బైరి శంకర్, జిల్లా కార్యదర్శి కుమ్మం లక్ష్మీనారాయణ ,వెంగళ రాములు, కోయాడ సంపత్ ,గాదె సారయ్య, రోడ్డు రాములు, రాయమల్లు సంతోష్ విష్ణువర్ధన్ రోశయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.
===========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *