ముందే ముక్కలవుతున్న ఇండియా కూటమి

సిరా న్యూస్;

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఈసారి ఎలాగైనా గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమి.. ఎన్నికలు రాకముందే ముక్కలుగా విడిపోతోంది. ఇప్పటికే ఆప్, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమి నుంచి బయటికి రాగా.. తాజాగా ఆ జాబితాలో జేడీయూ కూడా చేరింది. బిహార్‌లో అధికారంలో ఉన్న ఆర్జేడీ, జేడీయూ కూటమిలో తాజాగా నెలకొన్న పరిణామాలు.. అటు బిహార్ రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలపైనా ప్రభావం చూపుతున్నాయి. జాతీయ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీని ఓడించడం, కేంద్రంలో మోడీ లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో రూపుదిద్దుకున్న ఇండియా కూటమి కి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది.ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడనే లేదు. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు కూడా జరగలేదు. ఆ రకంగా వ్యవహారాలు ఒక కొలిక్కి రానేలేదు. అంతలోనే కూటమి ఐక్యతకు గండి పడింది. పశ్చిమబెంగాల్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా మాత్రమే పోటీచేయనున్నట్టుగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.ఇం.డి.యా. కూటమిలో అత్యంత కీలక పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉంటుంది. అదే సమయంలో ఆ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని ఆశిస్తున్న వారిలో మమతా దీదీ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అయితే కూటమి ఐక్యత ను పణంగా పెట్టి అయినా.. తన సొంత పార్టీకి మెజారిటీ సీట్లు దక్కించుకునే విషయంలో మాత్రం ఆమె ఏమాత్రం రాజీపడడం లేదు.ఇండియా కూటమిలో కీలక నేతగా ఉన్న నితీశ్ కుమార్ ఇప్పుడు ఏం చేస్తారు అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరోసారి బీజేపీతో చేరి.. ఇండియా కూటమికి బై బై చెబుతారనే వార్తలు వస్తున్నాయి.ఎప్పుడు ఏ కూటమితో జట్టు కడతారో.. ఎప్పుడు ఏ కూటమికి గుడ్ బై చెప్తారో చెప్పలేని నితీశ్ కుమార్ ప్రస్తుతం ఇండియా కూటమిని కాదని.. బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అడపాదడపా నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన వాటిని ఖండించారు. అయితే ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు.. బీజేపీతో తిరిగి దోస్తీ చేసేలా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే సమాజ్‌వాదీ, ఆప్, తృణముల్ కాంగ్రెస్ ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోని ఇండియా కూటమికి.. జేడీయూ రూపంలో మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఇండియా కూటమి భవితవ్యంపై ప్రశ్నార్థకం కానుందనే వార్తలు వస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఇండియా కూటమి పరిస్థితి బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ అడిగిన స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడంతో అఖిలేష్ యాదవ్.. ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నారు. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన తర్వాత.. కాంగ్రెస్ అంటే మిగితా పార్టీలు లెక్కచేయకపోవడం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కారణంగానే ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చింది. 42 సీట్లున్న పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెసు పార్టీకి కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తాం అని ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీని హేళన చేస్తూ మాట్లాడడం ఆమె వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లోకి అడుగుపెట్టిన రాహుల్ న్యాయ్ యాత్రను కూడా ఆమె చులకన చేసి మాట్లాడుతున్నారు.మమతా దీదీ ఏకపక్ష పెత్తందారీ ధోరణులు ఇండియా కూటమిని దెబ్బతీసేలాగానే కనిపిస్తున్నాయి. 42 సీట్లున్న వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెసు పార్టీకి కేవలం రెండే సీట్లు కేటాయిస్తామని అనడం ఆమె అహంకారానికి నిదర్శనంగా ఆ పార్టీ వ్యాఖ్యానిస్తోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలుచుకుంది. 2019లు వారి గెలుపు రెండు సీట్లకే పరిమితమైంది. వారి బలం ఉన్నది రెడు సీట్లే గనుక.. ఆ రెండు మాత్రమే కేటాయిస్తాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *