తిరుమల పురాతన కట్టడాలను భావితరాలకు అందించాలి

బిజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి
సిరా న్యూస్, తిరుమల;
హిందువులు 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆయోధ్యా రామాలయం ప్రారంభోత్సవం మరో 5 రోజుల్లో జరగబోతుంది. ఆ అమృత ఘడియలు కోసం యావత్ హిందులోకం ఎదురుచూస్తోందని బిజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు.ఓ వైపు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా ఆలయాలు నిర్నాణాలు జరుగుతుంటే మన దురదృష్టం ఏపీలో మాత్రం వందల దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. పునఃనిర్మించడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందుతుంది. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల పార్వేట మండపం కాలగర్భం కలిసిపోయింది. తిరుమల, తిరుపతిలో ఉన్న పురాతన మండపాలను పరిశీలించేందుకు కేంద్ర పురావస్తు శాఖ నుండి ముగ్గుల సభ్యుల కమిటీ నేడు వచ్చింది. అలిపిరి పాదాల మండపం , మరికొన్ని పురాతన మండపాలతో పాటు ఇటీవల టీటీడీ జీర్ణోధరణ చేసిన పార్వేట మండపాన్ని పరిశీలించవల్సిందిగా కమిటీని కోరుతానని అన్నారు.కాకతీయ కట్టడాలు సంరక్షించుకున్న తరహాలో తిరుమలలోని పురాతన కట్టడాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత టీటీడిపై ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *