-ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలకి శ్రీకారం చుట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
-సనాతన ధర్మం ఆచరిస్తే అంతా మంచే జరుగుతుందన్న టీజీ వెంకటేష్
సిరా న్యూస్,కర్నూలు;
మంచి హృదయంతో సనాతన ధర్మాన్ని ఆచరిస్తే వారు తలచుకున్న కార్యం తప్పక సిద్ధిస్తుందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.
సంకల్ బాగ్ లో ఉన్న హరిహర క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలను ధ్వజారోహణ చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పవిత్ర తుంగభద్రా నదీతీరంలో ఈ ఆలయం కట్టిన వేళ విశేషం, అలాగే ఇక్కడ బ్రాహ్మణులు ఎంతో నిష్టగా పూజలు నిర్వహించడం వల్ల ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఏర్పడిందన్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభించే రోజున, అలాగే ముగింపు చక్రస్నానం రోజున గరుడ పక్షి వచ్చి మూడు ప్రదక్షిణలు చేసి వెళ్లడం అనేది నిజంగా అద్భుతం అన్నారు. కొందరు దేవుడిని, సనాతన ధర్మాన్ని నమ్మమని అంటుంటారని.. అటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమలలో జరిగిన విధంగా, అదే పద్ధతిలో అంతే నిష్టగా ఇక్కడి పూజారులు నిర్వహించడం ఎంతో అభినందించదగ్గ విషయం అన్నారు. ప్రతి ఏడాది జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు ప్రజలందరూ తరలివచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలని టీజీ వెంకటేష్ ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ శర్మ, చంద్రశేఖర కల్కూర మరియు వేద పండితులు పాల్గొన్నారు.