సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ కాలనీలో గల సాయి వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్లో దొంగతనం చోటుచేసుకుంది… అర్ధరాత్రి దుండగులు బార్ షట్టర్ పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి అందులోని కౌంటర్లోని దాదాపు 30 వేల నగదు, రూ.3 వేల మద్యం ను అపహరించినట్లు బార్ యజమాని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.