సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని న్యామత్ నగర్ లో తగ్లిబే జమాతే ఇస్తేమా శనివారం ప్రారంభమయింది. రెండు రాష్ట్రాలనుంచి ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. దాదాపు 2 వందల ఎకరాల్లో సభ ఏర్పాట్లుచేసారు. నిర్వాహకులు జిల్లాల వారీగా బ్లాక్స్ ఏర్పాటు చేసారు. అధికారులు, పోలీసులు కార్యక్రమం సవ్యంగా జరిగేలా ఏర్పాట్లు చేసారు. తాగేందుకు మిషన్ భగీరథ నీళ్ళు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయా శాఖల అధికారులు అందిస్తున్నారు. ఇస్తేమా సభ ఏర్పాట్లను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నాంపల్లి మాజీ ఎమ్మెల్యే ఫెరోజ్ ఖాన్ పరిశీలించారు.